మెడికల్ ఎమర్జెన్సీ కోసం ప్రత్యేక అంబులెన్సులు: సజ్జనార్

ABN , First Publish Date - 2020-03-30T21:15:20+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సహకారంతో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రైవేట్ ఆసుపత్రుల

మెడికల్ ఎమర్జెన్సీ కోసం ప్రత్యేక అంబులెన్సులు: సజ్జనార్

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల అత్యవసర సేవల(మెడికల్ ఎమర్జెన్సీ)కు సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 13 అంబులెన్సులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సహకారంతో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రైవేట్ ఆసుపత్రుల వారి సౌజన్యంతో అంబులెన్సులు ప్రారంభించినట్లు సీపీ తెలిపారు.


రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటివరకూ 656 మందికి ప్రతి రోజు డయాలసిస్ కోసం అంబులెన్స్‌లను వినియోగిస్తున్నామన్నారు. డయాలసిస్ కోసం అప్లై చేసుకున్న పేషంట్లకు ఎస్బీ కానిస్టేబుళ్లు ఇంటికి వెళ్లి పాసులను అందజేశారన్నారని తెలిపారు.


మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు, గర్భిణిలు, వృద్ధుల కోసం ఇతర అవసరాలకు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే covidcontrol@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చని సజ్జనార్ తెలిపారు.

Updated Date - 2020-03-30T21:15:20+05:30 IST