బ్రెజిల్కు 2 కోట్ల డోసుల కొవాగ్జిన్
ABN , First Publish Date - 2021-02-27T09:10:45+05:30 IST
బ్రెజిల్కు భారత్ బయోటెక్ 2 కోట్ల డోసు ల కొవాగ్జిన్ను సరఫరా చేయనుంది. మార్చి-మే నెలల మధ్య ఈ మొత్తం వ్యాక్సిన్ను బ్రెజిల్కు ఎగుమతి చేస్తారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బ్రెజిల్కు భారత్ బయోటెక్ 2 కోట్ల డోసు ల కొవాగ్జిన్ను సరఫరా చేయనుంది. మార్చి-మే నెలల మధ్య ఈ మొత్తం వ్యాక్సిన్ను బ్రెజిల్కు ఎగుమతి చేస్తారు. ఈ మేరకు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు 2.9 లక్షల డాలర్లు ఉంటుంది. మొదటి విడతగా 80 లక్షల డోసులను మార్చిలో భారత్ బయోటెక్ ఎగుమతి చేసే వీలుంది. కాగా దాదాపు 40 దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ను సరఫరా చేయడానికి భారత్ బయోటెక్ కసరత్తు చేస్తోంది.