ఫుట్పాత్పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-03-31T22:06:07+05:30 IST
రాజధానిలో జరిగిన రోడ్డు ప్రమదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంతో వెళ్తున్న ఓ ట్రక్కు స్కూటర్ను ఢీకొట్టి ఆ తర్వాత ఫుట్పాత్పై నిద్రిస్తున్న అనాథల మీదికి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద జరిగింది. ప్రమాదంలో
ఢిల్లీ: రాజధానిలో జరిగిన రోడ్డు ప్రమదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంతో వెళ్తున్న ఓ ట్రక్కు స్కూటర్ను ఢీకొట్టి ఆ తర్వాత ఫుట్పాత్పై నిద్రిస్తున్న అనాథల మీదికి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద జరిగింది. ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి, ఫుట్పాత్పై నిద్రిస్తున్న అనాథ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. ట్రక్ డ్రైవర్ను అటిక్ అహ్మద్గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.