ఎంత పనిచేశావయ్యా.. ముద్దులొలికే రెండేళ్ల కూతురి కోసమైనా బతకొచ్చు కదా.. పాపం, రాత్రంతా తండ్రి శవం ముందే ఆ పాప..

ABN , First Publish Date - 2021-10-11T23:07:13+05:30 IST

పాపం రెండేళ్ల వయసులోనే తల్లి ఆ చిన్నారిని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెల్లింది. తల్లి ప్రేమకు దూరమైన ఆ చిట్టితల్లిని అన్నీ తానై తండ్రి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. కానీ సడెన్‌‌గా ఓ రోజు ఆ చిన్నారి భవిష్యత్తు గురించి కూడా

ఎంత పనిచేశావయ్యా.. ముద్దులొలికే రెండేళ్ల కూతురి కోసమైనా బతకొచ్చు కదా.. పాపం, రాత్రంతా తండ్రి శవం ముందే ఆ పాప..

భోపాల్: పాపం రెండేళ్ల వయసులోనే తల్లి ఆ చిన్నారిని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెల్లింది. తల్లి ప్రేమకు దూరమైన ఆ చిట్టితల్లిని అన్నీ తానై తండ్రి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. కానీ సడెన్‌‌గా ఓ రోజు ఆ చిన్నారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రేదేశ్‌లో జరిగింది.


విధిష ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల ప్రదీప్‌ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నాడు. ఈ సంవత్సరం మే నెలలో ప్రదీప్ భార్య కరోనాతో కన్నుమూసింది. అప్పటి నుంచి అతడు తన రెండేళ్ల కూతురు రౌనక్‌తో కలిసి ఉంటున్నాడు. భార్య మరణంతో ప్రదీప్ షాక్‌కు గురయ్యాడు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేని అతడు 4 నెలల తర్వాత, శనివారం రాత్రి పాపను నిద్రపుచ్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిద్రలోంచి లేచిన కూతురు తండ్రి కోసం అటూ ఇటూ వెతికింది. ఇంట్లో వేలాడుతున్నతండ్రి శవం ముందు కూర్చుని రాత్రంతా ఏడుస్తూనే ఉంది. కానీ ఎంత ఏడ్చినా తన తండ్రి ఆ చిట్టి తల్లిని దగ్గరకు తీసుకుని.. గుండెలకు హత్తుకోడనే విషయం తెలియదు. గట్టిగా ఏడిస్తేనైనా నాన్న లాలిస్తాడని అనుకుని అలాగే ఉదయం వరకు ఏడుస్తూ కూర్చుంది.


ఆదివారం ఉదయం ప్రదీప్ సోదరుడు ఏదో పని మీద అక్కడికి వెళ్లాడు. అతడు ఎంత పిలిచినా ప్రదీప్ తలుపులు తెరవలేదు. లోపలి నుంచి పాప ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో కిటికీలోంచి లోపలికి చూశాడు. అక్కడ కనిపించిన సీన్ చూసి షాకయ్యాడు. తన సోదరుడు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. అందరూ అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తండ్రి శవం దగ్గర ఏడుస్తూ ఉన్న ఆ పాపను కుటుంబసభ్యులు దగ్గరికి తీసుకున్నారు. ఎస్ శివేంద్ర పతాక్ మాట్లాడుతూ.. బాధితుడి శరీరం మీద ఉరి తాలూకు గుర్తులున్నాయని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

Updated Date - 2021-10-11T23:07:13+05:30 IST