పదిలోపు 3 ర్యాంకులు మావే: శ్రీచైతన్య
ABN , First Publish Date - 2021-10-17T08:27:02+05:30 IST
జేఈఈ అడ్వాన్స్డ్ 2021 ఫలితాల్లో తమ విద్యార్థులు 10లోపు మూడు ర్యాంకులు సాధించారని శ్రీ చైతన్య విద్యాసంస్థలు తెలిపాయి.
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్డ్ 2021 ఫలితాల్లో తమ విద్యార్థులు 10లోపు మూడు ర్యాంకులు సాధించారని శ్రీ చైతన్య విద్యాసంస్థలు తెలిపాయి. ఓపెన్ క్యాటగిరిలో మృదుల్ అగర్వాల్ 1, చైతన్య అగర్వాల్ 8, హృశికేష్ 10 ర్యాంకులు సాధించారని ఆ సంస్థ శనివారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. తమ విద్యార్థులు టాప్-100లో 26, టాప్-1000లో 124 ర్యాంకులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా. బీఎస్ రావు అభినందించారు.