ములుగు జిల్లాలో నలుగురికి కరోనా
ABN , First Publish Date - 2021-01-17T04:54:54+05:30 IST
ములుగు జిల్లాలో నలుగురికి కరోనా
ములుగు, జనవరి 16 : ములుగు జిల్లాకు చెందిన నలుగురు శనివారం కరోనా బారిన పడ్డారు. 245 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయగా గోవిందరావుపేట మండలంలో ముగ్గురికి, మంగపేటలో ఒక్కరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 5184కు చేరింది.