హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

ABN , First Publish Date - 2020-12-21T12:40:45+05:30 IST

హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

హైదరాబాద్ : వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యమయ్యారు. ఇందులో బిడ్డతో సహా తల్లి కూడా అదృశ్యమైంది. చందానగర్‌రెడ్డి కాలనీకి చెందిన నీరజ, ఆమె కుమారుడు కార్తీక్‌(11) అక్టోబర్‌ 7న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లారు. తిరిగి రాకపోవడంతో బంధువులు ఇళ్లలో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో భర్త వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


ఇందిరానగర్‌కు చెందిన జి.శోభ ఈనెల 12న శాంతినగర్‌లో ఉండే తండ్రి వద్దకు వెళ్తున్నానని తల్లికి చెప్పి వెళ్లింది. అనుమానం వచ్చిన తల్లి నర్సమ్మ ఈ నెల 18న భర్త కృష్ణకు ఫోన్‌ చేయగా, శోభ ఇంటికి రాలేదని చెప్పాడు. దీంతో తల్లి చందానగర్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.


కొంపల్లి మునిసిపాలిటీ పరిధి శివాలయం వెనుక వీధికి చెందిన యువతి అదృశ్యమైంది. శివాలయం వెనుక ఉండే మల్లిపూడి వీరబాబు కూతురు దివ్వశ్రీ(15) విద్యార్థిని. శనివారం రాత్రి ఇంట్లోనే నిద్రించింది. వేకువజాము నుంచి ఆమె కనిపించడం లేదు. పరిసరాల్లో వెతికినా ఆచూకీ కనిపించలేదు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చంటి అనే యువకుడు తమ కూతురిని గతంలో తీసుకువెళ్లాడని, ఇప్పుడూ అతనే తీసుకువెళ్లి ఉంటాడని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-21T12:40:45+05:30 IST