రెండు బైక్‌లను ఢీకొన్న లారీ.. చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-03-13T18:45:55+05:30 IST

నిజామాబాద్‌: ఓ లారీ సృష్టించిన బీభత్సంలో చిన్నారి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద జాతీయరహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

రెండు బైక్‌లను ఢీకొన్న లారీ.. చిన్నారి మృతి

నిజామాబాద్‌: ఓ లారీ సృష్టించిన బీభత్సంలో చిన్నారి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద జాతీయరహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లను లారీ ఢీకొట్టింది. నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-03-13T18:45:55+05:30 IST