ఏపీలో నేడు కొత్తగా 704 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-06-30T18:08:30+05:30 IST

అమరావతి: ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 704 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో నేడు కొత్తగా 704 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 704 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,595కి చేరుకుంది. కరోనా కారణంగా నేడు ఏడుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 187కు చేరుకుంది. 


ఏపీలోని 648, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 51 మందికి... ఇతర దేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు... గుంటూరు, అనంతపురంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఏపీలో 7,897 యాక్టివ్‌ కేసులుండగా.. 6,511 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Updated Date - 2020-06-30T18:08:30+05:30 IST