85 వేలు పెరిగిన మహిళా ఓటర్లు
ABN , First Publish Date - 2020-11-23T08:20:17+05:30 IST
గడిచిన ఐదేళ్లలో నగర జనాభా పెరిగినా ఓటర్ల సంఖ్య మాత్రం అనూహ్యంగా తగ్గింది. ఈ
హైదరాబాద్ సిటీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): గడిచిన ఐదేళ్లలో నగర జనాభా పెరిగినా ఓటర్ల సంఖ్య మాత్రం అనూహ్యంగా తగ్గింది. ఈ ఎన్నికల్లో మొత్తం 31,961 మంది ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల సమయానికి గ్రేటర్లో 74,36,247 మంది ఓటర్లు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 74,04,286గా ఉంది.
పురుష ఓటర్లలో అత్యధిక సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. మొత్తం 1,16,605 మంది పురుష ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. మహిళా ఓటర్ల సంఖ్య మాత్రం 84,929 పెరిగింది. ఇక, ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య కూడా 285 తగ్గింది.