85 వేలు పెరిగిన మహిళా ఓటర్లు

ABN , First Publish Date - 2020-11-23T08:20:17+05:30 IST

గడిచిన ఐదేళ్లలో నగర జనాభా పెరిగినా ఓటర్ల సంఖ్య మాత్రం అనూహ్యంగా తగ్గింది. ఈ

85 వేలు పెరిగిన మహిళా ఓటర్లు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): గడిచిన ఐదేళ్లలో నగర జనాభా పెరిగినా ఓటర్ల సంఖ్య మాత్రం అనూహ్యంగా తగ్గింది. ఈ ఎన్నికల్లో మొత్తం 31,961 మంది ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల సమయానికి గ్రేటర్‌లో 74,36,247 మంది ఓటర్లు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 74,04,286గా ఉంది.


పురుష ఓటర్లలో అత్యధిక సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. మొత్తం 1,16,605 మంది పురుష ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. మహిళా ఓటర్ల సంఖ్య మాత్రం 84,929 పెరిగింది. ఇక, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్ల సంఖ్య కూడా 285 తగ్గింది.


Updated Date - 2020-11-23T08:20:17+05:30 IST