విద్యుదాఘాతంతో 9 పశువులు మృతి

ABN , First Publish Date - 2021-06-19T23:51:52+05:30 IST

జిల్లాలో విద్యుదాఘాతంతో పశువులు మృతి చెందే పరంపర కొనసాగుతూనే

విద్యుదాఘాతంతో 9 పశువులు మృతి

మహబూబాబాద్: జిల్లాలో విద్యుదాఘాతంతో పశువులు మృతి చెందే పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా చిన్న కిష్టాపురం శివారు అడ్డాసికుంట తండాలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ తీగలు తాకడంతో 9 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇటీవలే నర్సంపేట మండలంలో వారం వ్యవధిలో పది పశువులు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. దీనికంతటికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-06-19T23:51:52+05:30 IST