వైభవంగా ఆటా వేడుకలు ఆరంభం
ABN , First Publish Date - 2022-07-03T09:40:13+05:30 IST
వైభవంగా ఆటా వేడుకలు ఆరంభం
(వాషింగ్టన్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దు కృష్ణ)
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు శుక్రవారం వాషింగ్టన్ డీసీలో వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలో భారత రాయబారి నందు ప్రారంభోపన్యాసం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు, అమెరికాలో సాఫ్ట్వేర్ దిగ్గజం ఐ కా రవి, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ చలసాని నాగప్రసాద్, ప్రముఖ కూచిపూడి కళాకారిణి లక్ష్మీబాబు తదితరులకు అవార్డులందజేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరయ్యారు. ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికా చేరుకున్నారు. తెలంగాణ పెవిలియన్ను కవిత ఆరంభించి ఆటా ప్రైమ్మీట్లో పాల్గొంటారు. బతుకమ్మపై ప్రత్యేకసంచికను ఆవిష్కరిస్తారు.