సీఎం కేసీఆర్కు ఓటరు లేఖ ?
ABN , First Publish Date - 2021-03-17T21:20:40+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఓటరు రాసిన లేఖ కౌంటింగ్ సిబ్బందికి
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఓటరు రాసిన లేఖ కౌంటింగ్ సిబ్బందికి దొరికింది. ఈ రోజు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ను సరూర్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్ 5 లో పోలింగ్ బూత్ నెంబర్ 62 నుంచి బ్యాలెట్ బాక్స్లో లభించిన లేఖను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ లేఖను సీఎం కేసీఆర్కు ఆ ఓటరు రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ లేఖలో ఏముందో తమకు తెలియదని అధికారులు పేర్కొన్నారు.