‘ప్రేమించిన అమ్మాయిని వారం రోజుల్లో నీ వశం చేస్తాం’.. ముఠా గట్టు రట్టు చేసిన ఏబీఎన్
ABN , First Publish Date - 2021-08-26T21:53:51+05:30 IST
వశీకరణ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రట్టు చేసింది. యువతీయువకులను టార్గెట్గా చేసుకుని మోసం చేస్తున్న ముఠాపై ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.
హైదరాబాద్: వశీకరణ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రట్టు చేసింది. యువతీయువకులను టార్గెట్గా చేసుకుని మోసం చేస్తున్న ముఠాపై ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ఏబీఎన్ చేసిన ఈ జాయింట్ ఆపరేషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వారం రోజుల్లో నువ్వు ప్రేమించే అమ్మాయిని నీ వశం చేస్తానంటూ నమ్మించి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. మల్లేపల్లి కేంద్రంగా ఈ దందా నడుస్తోంది. ఈ దందా గురించి తెలిసిన ఏబీఎన్.. టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ స్టింగ్ ఆపరేషన్లో ముఠాకు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. ఆ ఇద్దరినీ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.