ఏసీబీ వలలో ఇద్దరు జనగామ అధికారులు
ABN , First Publish Date - 2020-02-22T19:28:26+05:30 IST
ఏసీబీ వలలో ఇద్దరు జనగామ అధికారులు
జనగామ: జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సీ డెవలప్మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5వేలు తీసుకుంటూ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గట్టు మల్లు, సూపరింటెండెంట్ కదీరుద్దీన్ ఏసీబీ అధికారులకు చిక్కారు. గత ఏడాది డిసెంబర్ 31న అటెండర్ ఐలయ్య పదవీ విరమణ పొందారు. అయితే ఆయన జీతభత్యాలకు సంబంధించిన ఫైళ్లను పూర్తి చేయాలని కోరగా...అధికారులు రెండు నెలలుగా ఐలయ్యను కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. చివరకు ఐలయ్యను అధికారులు రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.5వేలు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.