కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2021-01-16T05:52:39+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కిషన్‌రెడ్డితో ఆచారి, నాయకులు

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

ఆమనగల్లు : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కిషన్‌రెడ్డి ఆమనగల్లులో కొద్దిసేపు జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమనగల్లు మున్సిపాలిటీ బీజేపీ కన్వీనర్‌ సుండూరు శేఖర్‌ ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు.  కార్యక్రమంలో నాయకులు జంతుక జానయ్య, పాషా, హమీద్‌, రవిరాఽథోడ్‌, విజయ్‌కృష్ణ, శ్రీకాంత్‌సింగ్‌, కండెసాయి, అమర్‌సింగ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:52:39+05:30 IST