అదుపుతప్పి ట్రాక్టరు బోల్తా

ABN , First Publish Date - 2021-09-19T05:05:01+05:30 IST

జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ట్రాక్టరు బోల్తా పడిడ్రైవరు మృతి చెందాడు. ఈ సంఘటన ముసలిమడుగులో శనివారం జరిగింది.

అదుపుతప్పి ట్రాక్టరు బోల్తా
బోల్తా పడిన ట్రాక్టర్‌

యువకుడు మృతి

బూర్గంపాడు, సెప్టెంబరు 18: జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ట్రాక్టరు బోల్తా పడిడ్రైవరు మృతి చెందాడు. ఈ సంఘటన ముసలిమడుగులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...బూర్గంపాడు మండల పరిదిలోని ముసలిమడుగుకు చెందిన లోకిరెడ్డి భూపాల్‌రెడ్డి(28) ట్రాక్టర్‌పై ముసలిమడుగు నుంచి కృష్ణసాగర్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముసలిమడుగు శివారులో జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ఆదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా పడినట్లు తెలిపారు. దీంతో మృతుడు జాతీయ రహదారిపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఆదుపుతప్పిన ట్రాక్టరు రోడ్డు పక్కన 10అడుగుల లోతులో ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-19T05:05:01+05:30 IST