ఫీజులు దండుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-06-18T04:23:56+05:30 IST
ఫీజులు దండుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
- బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తెలగమల్ల యాదీష్
మహేశ్వరం: ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తెలగమల్ల యాదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజులను నియంత్రించాలని గురువారం జిల్లా కలెక్టర్కు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. కొవిడ్తో అసలే విద్యా సంస్థలు మూసి ఉంటే ఈ కాలంలోనూ ఫీజులు వసూలు చేయడం అమానవీయం అన్నారు. ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతోంటే ఫీజుల కట్టాలంటూ ప్రైవేటు విద్యా సంస్థలు వొత్తిడి చేయడం సరికాదన్నారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ప్రభుత్వం వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో బీజేవైఎం నాయకులు రాహుల్రెడ్డి, బ్రహ్మచారి, భగీరథ్, దిలీ్పగౌడ్, శ్రీశైలం, రణధీర్గౌడ్, బస్వా రఘుగౌడ్, బుగ్గని భరత్కుమార్, సాయులు పాల్గొన్నారు.