‘‘ఎన్టీఆర్‌’ నిందితులపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-01-14T09:04:32+05:30 IST

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు హెచ్చరించారు.

‘‘ఎన్టీఆర్‌’ నిందితులపై చర్యలు తీసుకోవాలి’

సంతబొమ్మాళి, జనవరి 13: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం విగ్రహాన్ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది పాలకులు పాలించారని.. ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిందన్నారు. ఇప్పుడు దేవుళ్లు, రాజకీయ నాయకుల విగ్రహాల ధ్వంసంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చిందన్నారు. 

Updated Date - 2021-01-14T09:04:32+05:30 IST