ఒక్కరా.. ఇద్దరా!?
ABN , First Publish Date - 2020-12-13T06:55:06+05:30 IST
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆ మహానాయకురాలికి అపురూపమైన నివాళి అర్పిస్తూ, ఆమె జీవితకథ ఆధారంగా ‘తలైవి’ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
స్ఫూర్తిదాయకమైన జయలలిత కథను సెల్యులాయిడ్పై మలచడంలో ‘తలైవి’ టీమ్ ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. ఇక జయలలిత పాత్రలో ఒదిగిపోవడానికి కంగనా విశేషంగా కృషి చేస్తున్నారు. వివిధ దశల్లో కనిపించే జయలలిత శరీర ఆకృతికి మ్యాచ్ అయ్యే విధంగా తన బాడీని మలుచుకోవడానికి కంగనా ఎంతో శ్రమిస్తున్నారు. జయలలిత అలవాట్లు, ఆమె మాట్లాడే విధానం, హావభావాలు అన్నీ నిశితంగా పరిశీలించి, తెరపై అచ్చం జయలలితగా కనిపించడానికి కంగనా కేర్ తీసుకుంటున్నారు. జయలలిత ఒరిజనల్ ఫొటోను, ఆమె గెట్పలో ఉన్న కంగనా ఫొటోను పక్కపక్క పెట్టి చూస్తే ఒకరా.. ఇద్దరా! అనే అనుమానం కలగక మానదు.
తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్న ‘తలైవి’ చిత్రాన్ని విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకుడు.