కోల్ బెల్ట్ ఏరియా మావోయిస్టు పార్టీ లేఖ

ABN , First Publish Date - 2021-04-10T22:34:46+05:30 IST

కోల్ బెల్ట్ ఏరియా మావోయిస్టు పార్టీ లేఖ

కోల్ బెల్ట్ ఏరియా మావోయిస్టు పార్టీ లేఖ

ఆదిలాబాద్: కోల్ బెల్ట్ ఏరియా మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ లేఖ రాసినట్లు పేర్కొంది. ఈ నెల 20తో ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 40 ఏళ్లని, ఇంద్రవెల్లి కాల్పుల గాయాలు మానినా.. గుర్తులు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొంది. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సాహంతో జరుపుకోవాలని సూచించింది. ఊరూరా సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించుకుందామని లేఖలో పేర్కొంది. జల్-జంగల్-జమీన్‌తో పాటు అధికారం దక్కేవరకు పోరాడాల్సిందేనని మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-10T22:34:46+05:30 IST