Adilabad: శనిదేవుడి ఆలయానికి భక్తుల బారులు
ABN , First Publish Date - 2021-12-05T12:11:04+05:30 IST
శనివారం అమావాస్య రావడంతో భక్తులు శని దేవుడి ఆలయానికి శనివారం పెద్దఎత్తున బారులు తీరారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి పట్టణంలోని వినాయక్చౌక్లో
ఆదిలాబాద్: శనివారం అమావాస్య రావడంతో భక్తులు శని దేవుడి ఆలయానికి శనివారం పెద్దఎత్తున బారులు తీరారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి పట్టణంలోని వినాయక్చౌక్లో గల శని దేవుడి ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు చలిని సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడ్డారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తమ నవగ్రహ దోషాలు తొలగిపోవాలని కోరుతూ స్వామివారికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేశారు.
శని అమావాస్య పురస్కరించుకుని నార్నూర్ మండలంలోని భీం పూర్లో వెలసిన శనీశ్వరుడి విగ్రహానికి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తైలాభిషే కం చేశారు. శనివారం అమావాస్య కావడంతో శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చే యడం ద్వారా సుఖసంతోషాలు, ఆయూరారోగ్యాలు కలుగుతాయన్నారు. ఉంటా యన్నారు. అన్నసంతర్పనను జడ్పీ చైర్మన్ స్వతహాగా నిర్వహించారు.