ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2021-08-10T21:53:16+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఫైర్

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ఒక విధానం లేకుండా ఇష్టమొచ్చినట్లు అప్పులు చేసి దాన్ని సమర్ధించుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వడంలేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై నీచమైన పదజాలంతో దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 25న సీఎం జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. జగన్ తనకు తానే గోతులు తవ్వుకుంటూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-08-10T21:53:16+05:30 IST