నేటి నుంచి ‘ఎయిర్ ఇండియా’ బుకింగ్లు
ABN , First Publish Date - 2020-06-05T14:00:33+05:30 IST
అమెరికా, కెనడాల్లోని ఏడు ప్రాంతాలకు ఈనెల 9 నుంచి 30 వరకు 75 విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 4: అమెరికా, కెనడాల్లోని ఏడు ప్రాంతాలకు ఈనెల 9 నుంచి 30 వరకు 75 విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి బుకింగ్లు ప్రారంభమవుతాయని చెప్పింది. వందే భారత్ మిషన్ మూడో దశలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. న్యూయార్క్, నెవార్క్, షికాగో, వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, వాంకోవర్, టొరంటోతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది.