కొత్త ఖాతాదారులకు ఎయిర్‌టెల్ సూపర్ డూపర్ ఆఫర్

ABN , First Publish Date - 2020-12-01T00:53:33+05:30 IST

కొత్త ఖాతాదారులకు ఎయిర్‌టెల్ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారికి ఉచితంగా

కొత్త ఖాతాదారులకు ఎయిర్‌టెల్ సూపర్ డూపర్ ఆఫర్

న్యూఢిల్లీ: కొత్త ఖాతాదారులకు ఎయిర్‌టెల్ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారికి ఉచితంగా 5 జీబీ ఇవ్వనున్నట్టు తెలిపింది. కొత్త ఖాతాదారులు, 3జి నుంచి 4జికి అప్‌గ్రేడ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో భాగంగా ఖాతాదారులకు 1జీబీ చొప్పున మొత్తం ఐదు కూపన్లు లభిస్తాయి. సబ్‌స్క్రిప్షన్ అయిన తర్వాత 90 రోజుల్లోపు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఒకసారి ఒక కూపన్‌ను యాక్టివేట్ చేసుకుంటే మూడు రోజుల పాటు కాలవ్యవధి ఉంటుంది. ఒకసారి ఒక మొబైల్ నంబరుపై కూపన్‌ను ఉపయోగించుకుని, రెండోసారి రెండో మొబైల్ నంబరుకు అప్‌గ్రేడ్ చేస్తే.. మొదటి మొబైల్‌ నంబరుకు కూపన్లు ఉపయోగించడం సాధ్యం కాదు.


కొత్త ఖాతాదారులు, 4జికి అప్‌గ్రేడ్ అయ్యేవారు తొలుత ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ప్రీపెయిడ్ మొబైల్ నంబరుతో రిజిస్టర్ అయితే, 1జీబీ చొప్పున ఐదు కూపన్లు 72 గంటల వ్యవధిలో యూజర్ల ఖాతాలో క్రెడిట్ అవుతాయి. అవసరం అయినప్పుడు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని ‘మై కూపన్స్’ సెక్షన్‌లోకి వెళ్లి రిడీమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక నంబరుకు ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 5జీబీ ఉచిత డేటా ఆఫర్ వర్తించే వారికి, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను తొలిసారి తొలిసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే లభించే 2జీబీ ఉచిత డేటా ఆఫర్ వర్తించదు. 

Updated Date - 2020-12-01T00:53:33+05:30 IST