ఎయిర్‌టెల్‌ రూ.49 ఉచిత రీచార్జ్‌

ABN , First Publish Date - 2021-05-17T06:29:44+05:30 IST

ప్రస్తుత మహమ్మారి తీవ్రత సమయంలో సమాజంలోని బడుగువర్గాలు అనుసంధానత కలిగి ఉండేందుకు 5.5 కోట్ల మంది అల్పాదాయ వర్గాల వారికి రూ.49 ఉచిత రీచార్జ్‌ ప్యాక్‌ అందిస్తున్నట్టు...

ఎయిర్‌టెల్‌ రూ.49 ఉచిత రీచార్జ్‌

  • బడుగుల కోసం  

న్యూఢిల్లీ: ప్రస్తుత మహమ్మారి తీవ్రత సమయంలో సమాజంలోని బడుగువర్గాలు అనుసంధానత కలిగి ఉండేందుకు 5.5 కోట్ల మంది అల్పాదాయ వర్గాల వారికి రూ.49 ఉచిత రీచార్జ్‌ ప్యాక్‌ అందిస్తున్నట్టు భారతి ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. దీనికి తోడు రూ.79 రీచార్జి కూపన్‌ కొనుగోలు చేసిన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు రెండు ప్రయోజనాలూ చేకూరతాయని తెలిపింది. ఈ స్కీమ్‌ విలువ రూ.270 కోట్లని పేర్కొంది. ఇది ఏకకాల ఆఫర్‌గానే ఉంటుంది. ఈ ప్యాక్‌ కింద 28 రోజుల కాలపరిమితికి రూ.38 టాక్‌టైమ్‌, 100 ఎంబి డేటా లభిస్తాయి. 

Updated Date - 2021-05-17T06:29:44+05:30 IST