అలీషా హంత‌కుల్ని ఉద్యోగాల నుంచి తొల‌గించాలి: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2021-08-06T21:23:05+05:30 IST

నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలితీసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు మరో మైనార్టీ సోదరుడు అలీషాని అన్యాయంగా చంపేసిందని టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.

అలీషా హంత‌కుల్ని ఉద్యోగాల నుంచి తొల‌గించాలి: నారా లోకేష్‌

అమరావతి: నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలితీసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు మరో మైనార్టీ సోదరుడు అలీషాని అన్యాయంగా చంపేసిందని టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పక్కరాష్ట్రం నుంచి మ‌ద్యం త‌ర‌లిస్తున్నార‌నే నెపంతో అలీషాని కొట్టి చంపేసిన‌ పోలీసుల క‌ర్కశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అలీషా హంత‌కుల్ని ఉద్యోగాల నుంచి తొల‌గించాలని, అలీషా కుటుంబానికి 50 లక్షల ప‌రిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ స‌ర్కారు దాడుల్నించి మైనార్టీలకు ర‌క్షణ క‌ల్పించాలని నారా లోకేష్‌ కోరారు.

Updated Date - 2021-08-06T21:23:05+05:30 IST