240వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

ABN , First Publish Date - 2020-08-13T14:31:57+05:30 IST

రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 240వ రోజుకు చేరుకుంది.

240వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

అమరావతి: రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 240వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, దొండపాడు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మందడంలో న్యాయ దేవత అవతారంలో మహిళలు తమ నిరసనను తెలియజేయనున్నారు. పాలకులు మోసం చేసినా న్యాయస్థానాలు తమకు న్యాయం చేస్తాయని మహిళలు చెబుతున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-08-13T14:31:57+05:30 IST