రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం
ABN , First Publish Date - 2020-03-26T22:08:55+05:30 IST
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం
అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రులంతా సామాజిక దూరం పాటించేలా ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మూడు నెలల బడ్జెట్కు ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకురానుంది. అలాగే జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ఆర్డినెన్స్ పెట్టనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్కు ఆర్డినెన్స్ను ప్రభుత్వం పంపనుంది.