సీఎం జగన్ దళిత ద్రోహి: దళిత రైతులు
ABN , First Publish Date - 2021-08-03T17:17:21+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతారని అమరావతి ప్రాంత దళిత రైతులు అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతారని అమరావతి ప్రాంత దళిత రైతులు అన్నారు. ఇప్పటి వరకు కౌలు చెక్కులు ఇవ్వలేదని పేర్కొంటూ సీఆర్డీయేను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాజధానిలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పక్షపాతి అని చెప్పుకునే సీఎం..ఇంతవరకు కౌలు చెక్కులు ఇవ్వలేదన్నారు. ఎస్సీ, అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం చక్కగా వాడుకుంటోందని, ఎస్సీలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయడంలేదన్నారు. రాజధానిలో తమ బతుకులు బుగ్గిపాలయ్యాయని, వైసీపీ నేతలకు భయపడి చెప్పుకోడానికి ఎవరూ బయటకు రావడంలేదన్నారు. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని దళిత రైతులు వాపోయారు.