అమరావతి: మందడం దీక్షా శిబిరంలో శ్రావణ శుక్రవారం పూజలు

ABN , First Publish Date - 2020-08-14T18:19:22+05:30 IST

రాజధాని కోసం రైతుల, మహిళల నిరసనలు కొనసాగుతున్నాయి.

అమరావతి: మందడం దీక్షా శిబిరంలో శ్రావణ శుక్రవారం పూజలు

అమరావతి: రాజధాని కోసం రైతుల, మహిళల నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం దీక్షా శిబిరంలో మహిళలు శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు. న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరగాలని అమ్మవారిని వేడుకున్నారు. మహిళలు, రైతులు న్యాయదేవత చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మందడం రైతుల దీక్షకు మాజీ మంత్రి దేవినేని ఉమ, సీపీఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. 

Updated Date - 2020-08-14T18:19:22+05:30 IST