మా ఆవేదన వైఎస్ షర్మిల వినాలి: అమరావతి రైతులు

ABN , First Publish Date - 2021-04-18T23:35:49+05:30 IST

మా ఆవేదన వైఎస్ షర్మిల వినాలి: అమరావతి రైతులు

మా ఆవేదన వైఎస్ షర్మిల వినాలి: అమరావతి రైతులు

అమరావతి: తమ ఆవేదన వినాలని వైఎస్ షర్మిలకు అమరావతి మహిళా రైతులు కోరారు. షర్మిల తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ వీడియోను విడుదల చేశారు. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని అమరావతి మహిళా రైతులు తెలిపారు. 2019లో మా అన్నకి ఓటేయండి రామన్న రాజ్యం వస్తుందని షర్మిల చెప్పారని రైతులు గుర్తుచేశారు. ఏపీలో రావణరాజ్యం వచ్చిందిందని రాజధాని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం అని షర్మిల  ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు అమరావతి మహిళా రైతులు పేర్కొన్నారు. ఏపీలో కూడా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నామన్నారు. అందుకు నడుంబిగించాలంటూ షర్మిలకు మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-18T23:35:49+05:30 IST