తెలంగాణ పర్యటనకు అమిత్ షా?

ABN , First Publish Date - 2021-09-05T19:07:58+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.

తెలంగాణ పర్యటనకు అమిత్ షా?

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. ఈనెల 17న ఆయన రాష్ట్రానికి రానున్నట్లు తెలియవచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా  తెలంగాణ బీజేపీ నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని రజాకార్లు మర్రి చెట్టు వద్ద  ఊచకోత కోశారు. దీంతో కాలక్రమంలో వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. సెప్టెంబర్ 17నాటికి బండి‌ సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్‌కు చేరుకునేలా నేతలు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు పాదయాత్రతో పాటు బహిరంగ సభలో అమిత్ షా  పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-09-05T19:07:58+05:30 IST