కర్నూలు జిల్లాకు... సంజీవయ్య పేరు పెట్టాలి!
ABN , First Publish Date - 2021-10-23T08:38:18+05:30 IST
అణగారిన వర్గాల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.
రూ.కోటితో స్మారక భవనం: పవన్ కల్యాణ్
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా పేరును వైఎ్సఆర్ కడప జిల్లా మార్చినప్పుడు.. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టడం సమంజసమేనన్నారు. తమ ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో అధికార మార్పిడి అనంతరం జనసేన పార్టీయే ‘దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా’గా మారుస్తుందని తెలిపారు. కాగా, రాజధాని అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబరు 1నుంచి చేపట్టనున్న మహా పాదయాత్రకు మద్దతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు జనసేనను కోరారు.