Anantapur: కారును ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-08-02T12:29:05+05:30 IST
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుత్తి సమీపంలోని హైవేపై చోటు చేసుకుంది
అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుత్తి సమీపంలోని హైవేపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్నూలు జిల్లాకు చెందిన అశ్రఫ్ అలీ, లాయక్ అలీ, ఖాసీంగా గుర్తించారు.