ఆంధ్రా వర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2020-09-25T04:29:18+05:30 IST
ఆంధ్రా వర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ వాయిదా
అమరావతి: ఆంధ్రా వర్సిటీలో మూల్యాంకనం, రీవాల్యువేషన్లో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సీఎస్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్, వీసీలకు నోటీసులు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది.