నిరాధారమైన వార్తలు రాస్తే సహించం: సీపీ
ABN , First Publish Date - 2020-02-22T22:12:55+05:30 IST
ఆరేళ్లలో నక్సలిజం, టెర్రరిజం కదలికలు లేవని సీపీ అంజనీకుమార్ తెలిపారు. సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులపై కథనాలు రాస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్: ఆరేళ్లలో నక్సలిజం, టెర్రరిజం కదలికలు లేవని సీపీ అంజనీకుమార్ తెలిపారు. సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులపై కథనాలు రాస్తున్నారని విమర్శించారు. మీడియాలో కథనాలు ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండాలన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే సహించమని హెచ్చరించారు. దేశంలోనే బెస్ట్ పోలిసింగ్గా నిలిచామని, బదిలీలు, ప్రమోషన్లు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని సీపీ పేర్కొన్నారు.