‘టోక్యో’లో సానియా భాగస్వామి అంకిత

ABN , First Publish Date - 2021-06-10T10:10:06+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భాగస్వామిగా అంకితా రైనా ఎంపికైంది. సానియా-అంకిత జోడీ మహిళల డబుల్స్‌ బరిలో దిగనుంది...

‘టోక్యో’లో సానియా భాగస్వామి అంకిత

ముంబై: టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భాగస్వామిగా అంకితా రైనా ఎంపికైంది. సానియా-అంకిత జోడీ మహిళల డబుల్స్‌ బరిలో దిగనుంది. ఈ విషయాన్ని అంకిత బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. గాయంతో ఆటకు విరామం ప్రకటించే సమయానికి సానియా డబుల్స్‌లో తన తొమ్మిదో ర్యాంక్‌ను నిలబెట్టుకోవడంతో ఆమె నేరుగా విశ్వక్రీడలకు ఎంపికైంది. నిబంధనల ప్రకారం టాప్‌-300లోపు ర్యాంక్‌ క్రీడాకారిణిని తన డబుల్స్‌ భాగస్వామిగా ఎంచుకునే అవకాశం సానియాకు ఉంది. దీంతో ప్రస్తుతం డబుల్స్‌లో 95వ ర్యాంక్‌లోనున్న అంకితతో కలిసి సానియా టోక్యోలో పోటీపడనుంది. ఒలింపిక్స్‌ బరిలో దిగడం సానియాకిది నాలుగోసారి. 


Updated Date - 2021-06-10T10:10:06+05:30 IST