రాష్ట్రంలో మరో 1,579 కేసులు

ABN , First Publish Date - 2020-10-22T06:57:56+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 1,579 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో ఐదుగురు మృతిచెందారు.

రాష్ట్రంలో మరో 1,579 కేసులు

వైర్‌సతో ఐదుగురు మృతి

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 1,579 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,124కు, మృతుల సంఖ్య 1,287కు చేరింది. మంగళవారం 41,475 మందికి పరీక్షలు నిర్వహించారు. 1,120 నమూనాల ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు 39.40 లక్షల టెస్టులు నిర్వహించారు.


తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 256, మేడ్చల్‌లో 135, రంగారెడ్డి జిల్లాలో 102, ఖమ్మంలో 106, భద్రాద్రి కొత్తగూడెంలో 87, నల్లగొండలో 90 నమోదయ్యాయి. మంగళవారం 1,811 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 2,04,388 రికవరీ అయ్యారు.


Updated Date - 2020-10-22T06:57:56+05:30 IST