మరో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్
ABN , First Publish Date - 2021-12-04T00:30:52+05:30 IST
పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల
సంగారెడ్డి: పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్ వచ్చిది. నిన్నటి పరీక్షలలో విద్యార్థినులకు కరోనాగా తేలిన విషయం తెలిసిందే. దీంతో రెండోరోజు 584 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు పాఠశాలలో మొత్తం 46 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లయింది. వీరందరిని పాఠశాలలోనే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేసులు పెరుగుతుండడంతో భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు.