బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-05-29T00:58:42+05:30 IST
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదాపూర్లోని మీనాక్షి టవర్స్లో..
హైదరాబాద్: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదాపూర్లోని మీనాక్షి టవర్స్లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్పించేలోపే కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్టు సమాచారం.