మాణిక్యాలరావు అంత్యక్రియల్లో సోము వీర్రాజు కన్నీటి పర్యాంతం

ABN , First Publish Date - 2020-08-02T03:45:48+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. మాణిక్యాలరావు అంత్యక్రియల్లో...

మాణిక్యాలరావు అంత్యక్రియల్లో సోము వీర్రాజు కన్నీటి పర్యాంతం

ఏలూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. మాణిక్యాలరావు అంత్యక్రియల్లో కన్నీటి పర్యంతమయ్యారు. మాణిక్యాలరావు కుటుంబానికి పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలిపారు. సహచరుణ్ణి కోల్పోయానని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. బీజేపీకి మాణిక్యాలరావు మృతి తీరని లోటని సోము వీర్రాజు పేర్కొన్నారు. 


ఇక మాణిక్యాలరావు అంత్యక్రియలు తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబసభ్యులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డీఎస్పీ కె.రాజేశ్వర రెడ్డి, ఆర్డీవో రచన, మున్సిపల్ కమిషనర్ బాల స్వామి, పోలీస్ అధికారులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 


Updated Date - 2020-08-02T03:45:48+05:30 IST