కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు
ABN , First Publish Date - 2020-02-28T13:24:40+05:30 IST
కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతి: రాజధాని కోసం రైతులు తమ ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతం చేస్తున్నారు. వారు చేపట్టిన ఆందోళనలు నేటితో 73వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నా...అలాగే వెలగపూడిలో 73వ రోజు రిలేదీక్షలు కొనసాగనున్నాయి. అటు పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు కొనసాగిస్తున్నారు. అటు మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.