సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఇదే!
ABN , First Publish Date - 2020-06-01T19:54:31+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలసిందే.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల తర్వాత తొలిసారి ఢిల్లీకి సీఎం వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు సీఎం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు. 10.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 10.30 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ విమానం బయలుదేరనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా జనపథ్ - 1కు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జనపథ్ - 1కు చేరుకోనున్నారు.
ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. షాతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో జగన్ భేటీ కానున్నారని తెలియవచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వ్యవహారాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు.