చంపావతి నది కుంటలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2021-06-22T00:24:55+05:30 IST

చంపావతి నది కుంటలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

చంపావతి నది కుంటలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

విజయనగరం: జిల్లాలోని గజపతినగరం మండలం ఎం.వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. చంపావతినది కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దాంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-06-22T00:24:55+05:30 IST