కర్నూలు, నెల్లూరుల్లో జూనియర్ డాక్టర్ల నిరసన
ABN , First Publish Date - 2020-08-13T07:13:45+05:30 IST
కర్నూలు, నెల్లూరుల్లో జూనియర్ డాక్టర్ల నిరసన
కర్నూలు హాస్పిటల్, నెల్లూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కొవిడ్ బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్న తమకు నాణ్యమైన పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు పంపిణీ చేయాలని, డాక్టర్లకు 50లక్షల కరోనా బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు, నెల్లూరుల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ కొవిడ్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో జూనియర్ డాక్టర్లు ప్లకార్డులు చేపట్టి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.