ఈనెల 28 నుంచి ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-26T19:09:30+05:30 IST

ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వతేదీ వరకు ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఈనెల 28 నుంచి ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలు

విశాఖ: ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వతేదీ వరకు ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సుమారు 28,726 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-26T19:09:30+05:30 IST