ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ గోల్ సాధించాం: డీజీపీ
ABN , First Publish Date - 2020-10-30T00:30:01+05:30 IST
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ గోల్ సాధించినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్వరాజ్ మైదానంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ బ్రాస్ బ్యాండ్ నిర్వహించారు. సీఎస్ నీలం
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ గోల్ సాధించినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్వరాజ్ మైదానంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ బ్రాస్ బ్యాండ్ నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. పోలీసులకు రక్షణ మాత్రమే కాకుండా కల్చరల్ అంశాలు కూడా తెలుసు అన్నారు. పోలీస్ బ్యాండ్లో పైప్ బ్యాండ్ అనేది ఒక కొత్త విధానం అని చెప్పారు. 48 స్కాచ్ అవార్డులు, గవర్నెన్స్ నవ్ అనే 18 అవార్డులు ఏపీ పోలీస్శాఖకు వచ్చాయని వెల్లడించారు.
సీఎస్ నీలం సాహ్ని..
బాధ్యతలు నిర్వహిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరులను గుర్తుంచుకోవాలని సీఎస్ నీలం సాహ్ని అన్నారు. కోవిడ్తో చాలా మంది పోలీసులు మరణించారని తెలిపారు. దాదాపు 15 శాతం జనాభాకి మన రాష్ట్రంలో కోవిడ్ టెస్టులు జరిగినట్లు సీఎస్ పేర్కొన్నారు.