రొయ్య లాక్డౌన్!
ABN , First Publish Date - 2020-04-01T09:25:33+05:30 IST
కరోనా ప్రభావానికి ఆక్వా కుదేలైంది... ఎగుమతులు నిలిచిపోయాయి...ప్రాసెసింగ్ యూనిట్లు మూతపడ్డాయి. ఉన్న యూనిట్లలోనూ గరిష్ఠస్థాయిలో నిల్వలు ఉండటం.. రొ య్యల చెరువుల వద్ద కూలీల కొరత...
కరోనా ప్రభావానికి ఆక్వా కుదేలైంది... ఎగుమతులు నిలిచిపోయాయి...ప్రాసెసింగ్ యూనిట్లు మూతపడ్డాయి. ఉన్న యూనిట్లలోనూ గరిష్ఠస్థాయిలో నిల్వలు ఉండటం.. రొయ్యల చెరువుల వద్ద కూలీల కొరత.. ప్రభుత్వాల ఉదాసీన త వెరసి ఆక్వా రైతు నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ‘కరోనాతో సంబంధం లేకుండా ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం. 30 కౌంట్ ధర రూ.430, 40 కౌంట్ ధర రూ.310, 50 కౌంట్ ధర రూ.260 100 కౌంట్ ధర రూ.180గా నిర్ణయించాం’..అని మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ రెండు రోజుల క్రితం ప్రకటన చేసినా అందులో సగం ధర కూడా రాని పరిస్థితిని రైతులు చవిచూస్తున్నారు. ఈ ఒక్క సీజన్లోనే రూ.12 వేల కోట్ల మేర నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. నేరుగా ‘ఎంపెడా’ రంగంలోకి దిగాలని, ఆక్వా ఉత్పత్తులను మద్దతుధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
-విజయవాడ