ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-11T01:59:08+05:30 IST
అక్రమంగా ఎర్ర చందనం దుంగలను రవాణా చేస్తున్న ఆరుగురు స్మగ్లర్లను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప: అక్రమంగా ఎర్ర చందనం దుంగలను రవాణా చేస్తున్న ఆరుగురు స్మగ్లర్లను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పుల్లంపేట మండలంలోని బోటుమీదపల్లి దగ్గర వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు, వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ సమయంలో వేటకొడవళ్లు, కర్రలతో పోలీసులపై స్మగ్లర్లు దాడికి ప్రయత్నం చేశారు.